హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): భారతీయులు చికెన్ బిర్యానీకి ఫిదా అవుతున్నారు. రకరకాల బిర్యానీలు ఉన్నా.. ఆన్లైన్లో చికెన్ బిర్యానీల ఆర్డర్స్ పోటెత్తుతున్నాయి.తాజాగా ప్రముఖ ఆన్లైన్ డెలివరీ సంస్థ స్విగ్గీ మంగళవారం దేశవ్యాప్తంగా ఆర్డర్ మెనూ లిస్ట్-2021ను విడుదలచేసింది. ప్రతి సెకన్కు రెండు చికెన్ బిర్యానీ ఆర్డర్స్ వస్తున్నాయని వెల్లడించింది.టాప్ 10 ఆహార పదార్థాల్లో మొదటి స్థానం చికెన్ బిర్యానిదే. నిమిషానికి 120 బిర్యానీల ఆర్డర్స్ వచ్చాయని పేర్కొన్నది. స్వీట్స్లో గులాబ్జామ్ టాప్లో ఉన్నది. స్నాక్స్లో సమోసా ఐదుమిలియన్ల ఆర్డర్స్తో మొదటి స్థానం దక్కించుకున్నది. వెజిటెబుల్స్, పండ్లకు సంబంధించి 28 మిలియన్ల ఆర్డర్స్ వచ్చాయని స్విగ్గీ తెలిపింది. బెంగళూరు తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికఆర్డర్లు వచ్చినట్టు పేర్కొన్నది. 2019లో నిమిషానికి 90 చికెన్ బిర్యానీల ఆర్డర్స్ వస్తే ఈసారి ఆర్డర్స్ పెరగడం విశేషం. 4.25 లక్షల మంది కొత్త కస్టమర్లు చికెన్ బిర్యానీ ఆర్డర్ కోసం స్విగ్గీలోచేరారని తెలిపింది. కొవిడ్ కారణంగా మెడిసిన్ సైప్లె ఆర్డర్స్ 288 శాతం పెరిగాయని వివరించింది. ఆన్లైన్పై ఆధారపడి నచ్చిన వంటకాలను తెప్పించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టుస్విగ్గీ వెల్లడించింది.