సిల్హట్: మహిళల టీ20 ఆసియాకప్ను ఇండియా కైవసం చేసుకున్నది. ఆసియాకప్ ఫైనల్లో ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఈజీ విజయాన్ని నమోదు చేసింది. 66 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 8.3 ఓవర్లలోనే ఆ టార్గెట్ను చేధించింది. స్మృతి మందానా సూపర్ హిట్టింగ్తో లక్ష్యం మరీ ఈజీ అయ్యింది. మందానా అజేయంగా 51 రన్స్ చేసింది. ఇండియా మహిళల జట్టు ఆసియాకప్ను గెలవడం ఇది ఏడోసారి కావడం విశేషం.
CHAMPIONS 🏆
Congratulations to India on their 7th Women's Asia Cup triumph 👏#WomensAsiaCup2022 | Scorecard: https://t.co/KKwY2tz2Pb | 📸 @ACCMedia1 pic.twitter.com/7U15d7ibT3
— ICC (@ICC) October 15, 2022
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో కేవలం 9 వికెట్లకు 65 పరుగులు మాత్రమే చేసింది. ఇండియన్ బౌలర్ రేణుకా సింగ్ థాకూర్ తన బౌలింగ్తో లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. ఆమె మూడు ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నది. రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ రాణాలు చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఆరంభం నుంచి భారత బౌలర్లు లంక బ్యాటర్లను కట్టడి చేశారు.