శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న గాల్వన్ లోయలో .. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులు గాల్వన్ లోయలో జాతీయ జెండా ఆవిష్కరించి న్యూ ఇయర్కు వెల్కమ్ తెలిపారు. గాల్వన్ లోయకు మరో వైపు చైనా సైనికులు తమ జాతీయ జెండాను ప్రదర్శించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల రెండు దేశాల సరిహద్దు అయిన గాల్వన్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గత ఏడాది గాల్వన్లో జరిగిన ఘర్షణలో రెండు దేశాలకు చెందిన సైనికులు మరణించారు. ఆ ఘర్షణ తర్వాత రెండు దేశాల సైనిక అధికారుల మధ్య పలు దఫాల చర్చలు జరిగాయి.