న్యూఢిల్లీ, అక్టోబర్ 13: చదువుల కోసం సంపన్న దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు అక్కడే స్థిరపడే అవకాశాలున్నాయని ఓ తాజా నివేదిక అంచనా వేస్తున్నది. 38 సంపన్న దేశాల ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ ఓఈసీడీ వలసల తీరుతెన్నులపై అధ్యయనం జరిపి ఆ నివేదికను విడుదల చేసింది.
ఓఈసీడీ దేశాల్లో 2020లో చదువుకొంటున్న విదేశీ విద్యార్థుల్లో 97 లక్షల మంది చైనాకు చెందినవారు. మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో వారు 22 శాతం వరకు ఉంటారు. కాగా భారతీయ విద్యార్థులు 4.36 లక్షల వరకు (10 శాతం) ఉంటారని అంచనా.