న్యూఢిల్లీ : భారత స్టార్ షట్లర్ పివి సింధు ఈనెల 21నుంచి టోక్యోలో జరుగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్నుంచి వైదొలగుతున్నట్టు తెలిపింది. తన ఎడమ పాదంపై ఒత్తిడి వల్ల భరించలేని నొప్పి కలుగుతోందని, కామన్వెల్త్ క్రీడలనుంచి ఇది బాధిస్తోందని తెలిపింది.
స్వదేశానికి రాగానే వైద్యులను సంప్రతించానని, ఎడమ పాదంలో ఒత్తిడివల్ల చీలిక ఏర్పడిందని, కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వెల్లడించినట్టు సింధు తెలిపింది. ఈ నొప్పితోనే కామన్వెల్త్ ఫైనల్లో పాల్గొన్నానని, కోచ్, ఫిజయోల తోడ్పాటుతో ఆటను కొనసాగించి స్వర్ణం గెలుచుకున్నానని అన్నది.