న్యూఢిల్లీ : రైల్వే మంత్రిత్వశాఖ గురువారం కొవిడ్ సంబంధిత మార్గదర్శకాలను మరో ఆరు నెలలు పొడగించింది. స్టేషన్లతో పాటు రైలులో ప్రయాణించే సమయంలో మాస్క్ ధరించకపోతే రూ.500 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణానికి ముందు తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలు జారీ చేసిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకోవాలని రైల్వేశాఖ సూచించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ దేశంలో కొత్తగా 22,431 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది. ఇందులో 3,32,00,258 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వైరస్తో ఇప్పటి వరకు 4,49,856 మంది మృతిచెందగా, ప్రస్తుతం దేశంలో 2,44,198 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.