అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు సాధన జోరుగా కొనసాగుతున్నది. ఈనెల 4 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో జట్టు ఆటగాళ్లంతా నెట్స్లో చెమటోడ్చారు.
బ్యాట్స్మెన్..పేసర్లు, స్పిన్నర్ల బౌలింగ్ను ఎదుర్కొన్నారు. ఆటగాళ్లు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. టీమ్ఇండియా నెట్ ప్రాక్టీస్కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. చివరి టెస్టును డ్రా చేసుకున్నా కూడా కోహ్లీసేన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తుంది.