ఆర్హుస్: భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. గత పదేండ్లలో పురుషుల జట్టు నాకౌట్కు చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. థామస్కప్ గ్రూప్-సిలో భాగంగా జరిగిన పోరులో భారత్ 5-0తో తహిటిపై నెగ్గి క్వార్టర్స్కు చేరగా.. ఉబెర్ కప్లో ఇప్పటికే క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత మహిళల జట్టు చివరి లీగ్ మ్యాచ్లో 0-5తో థాయ్లాండ్ చేతిలో ఓడింది. థామస్ కప్ సింగిల్స్లో సాయి ప్రణీత్ 21-5, 21-6తో లూయిస్పై.. సమీర్ వర్మ 21-12, 21-12తో రెమీ రోసీపై.. కిరణ్ 21-4, 21-2తో ఎలీస్పై విజయాలు సాధించగా.. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం 21-5, 21-3తో ఎలీస్-వోనెట్ జంటపై, కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 21-8, 21-7తో గ్లెన్-రెమీ ద్వయంపై గెలుపొందింది. ఉబెర్ కప్ తొలి రెండు మ్యాచ్ల్లో స్పెయిన్, స్కాట్లాండ్పై విజయాలు సాధించిన మహిళల టీమ్ బుధవారం థాయ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. సింగిల్స్లో మాళవిక, అదితి, త్రిశ ఓడగా.. డబుల్స్లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి, గాయత్రి గోపీచంద్-త్రిశ జోడీలు విఫలమయ్యాయి.