మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్, 21 : స్వాతంత్య్ర సమర యోధుడు, తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలో దళిత శక్తి ప్రోగ్రామ్, తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ నందిపాటి రాజు, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, బీసీ సంఘాల ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్, నాయకులు అల్లి సాగర్యాదవ్, సబ్బని రాజేంద్ర ప్రసాద్, జుమిడి గోపాల్, క్రాంతి, నితిన్, శంకర్, బొలిశెట్టి లక్ష్మణ్, వైద్య భాస్కర్, బిట్రగుంట రాంబాబు, వెన్నంపల్లి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్ : కొండా లక్ష్మణ్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న పద్మశాలీ సంఘ సభ్యులు
చెన్నూర్ పట్టణంలో..
చెన్నూర్, సెప్టెంబర్ 21: మున్సిపాలిటీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి మున్సిపల్ చైర్పర్సన్ అర్చనాగిల్డా, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పూల మాలలు వేసి నివాలర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, తుమ్మ రమేశ్, జగన్నాథుల శ్రీను, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు అయూబ్, టీఆర్ఎస్ నాయకులు జాడి తిరుపతి, మేడ సురేశ్రెడ్డి, కొండపర్తి వెంకటరాజం, నాయిని సతీశ్, మహేందర్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి పట్టణంలో..
మందమర్రి, సెప్టెంబర్ 21: మందమర్రి పట్టణంలోని అంగడిబజార్ ఏరియాలో గల పద్మశాలీ భవన్లో ఆ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు చిలగాని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి సామల సత్యనారాయణ, గాదాసు శంకరయ్య, యువజన అధ్యక్షుడు ఉడుత చంద్రమౌళి, మెండె భాస్కర్, వెల్ది ప్రభాకర్, బండారి రాజేశం, ఎన్నం రాజ్కుమార్, ఎనగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి మండలంలో..
కోటపల్లి, సెప్టెంబర్ 21 : మండలంలోని బావనపల్లి ప్రాథమిక పాఠశాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం బాణాల లక్ష్మీనారాయణ, పాఠశాల హెచ్ఎం బొలిశెట్టి బుచ్చయ్య, సీఆర్పీ సంపత్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
రామకృష్ణాపూర్ పట్టణంలో..
రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 21: రాజీవ్చౌక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ పద్మశాలీ సేవా సంఘం అధ్యక్షుడు మిట్టపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొక్కుల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జోగుల వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శులు, కొండ కుమార్, వొడ్నాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.