దుబాయ్: మహిళల టీ20 ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ టాప్-10లో చోటు దక్కించుకుంది. కామన్వెల్త్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శనతో జెమీమా పదో ర్యాంక్కు చేరుకోగా, స్మృతి మందన(4), షెఫాలీ వర్మ(6) పది ర్యాంక్ల్లోపు ఉన్న ఇతర భారత బ్యాటర్లు. ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ తిరిగి నంబర్వన్ ర్యాంక్ చేజిక్కించుకుంది. కామన్వెల్త్లో అయిదు ఇన్నింగ్స్లలో బెత్ మూనీ 179 పరుగులతో టాప్ ర్యాంక్కు చేరుకుంది.
గత ర్యాంకింగ్స్లో లానింగ్కు తన ర్యాంక్ను కోల్పోయిన మూనీ కామన్వెల్త్లో పాకిస్థాన్పై 70నాటౌట్, సెమీస్లో న్యూజిలాండ్పై 36, ఫైనల్లో ఇండియాపై 61 పరుగులతో రాణించింది. ఇటీవల ర్యాంకింగ్స్లో వెనుకంజవేసిన జెమీమా.. కామన్వెల్త్లో బార్బడోస్పై 56(నాటౌట్), సెమీస్లో ఇంగ్లండ్పై 44(నాటౌట్), ఫైనల్లో ఆస్ట్రేలియాపై 33 పరుగులతో మొత్తంగా 146 పరుగులతో సత్తాచాటింది. కేవలం మందన(159) మాత్రమే జెమీమా కంటే ఎక్కువ పరుగులు చేసింది.