మాస్కో: రష్యాలోని నిజ్నీలో ఈ నెల నుంచి 16 వరకు బహుళ దేశాల సైనిక విన్యాసాలు ‘జపాడ్ 2021’ జరుగనున్నాయి. భారత ఆర్మీ కూడా ఇందులో పాల్గొంటున్నదని. ఈ నేపథ్యంలో ఆర్మీ చెందిన బృందం రష్యాకు బుధవారం బయలు దేరింది. కాగా, రష్యన్ సాయుధ దళాల థియేటర్ స్థాయి వ్యాయామాలలో ‘జపాడ్ 2021’ ఒకటి. ప్రధానంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ఇది దృష్టి సారిస్తుంది. యురేషియా, దక్షిణ ఆసియా ప్రాంతాలకు చెందిన 12కు పైగా దేశాలు ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. చైనీస్, పాకిస్థాన్ సైన్యాలు పరిశీలకులుగా పాల్గొంటాయని భారత ఆర్మీ పేర్కొంది.