న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులను 50శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు తమకు కేటాయించిన సమయంలోనే కార్యాలయాలకు రావాలని, భౌతిక దూరంతో పాటు కరోనా మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ఇక సమావేశాలు వీలైనంత వరకు వర్చువల్ విధానంలో నిర్వహించాలని చెప్పింది.
ఇదిలా ఉండగా.. పారామిలటరీ దళాల్లో కరోనా కేసులు గత పది రోజుల్లో ఐదు రెట్లు పెరిగాయి. ఏప్రిల్ 5న ఆర్డ్మ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో కరోనా పాజిటివ్గా పరీక్షించిన జవాన్ల సంఖ్య 522 ఉండగా.. ప్రస్తుతం 2,915కు చేరింది. మరో వైపు దేశంలో రోజువారీ కరోనా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా శనివారం 2,34,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,341 మంది ప్రాణాలు కోల్పోయిన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 16,79,740 ఉన్నాయని, ఇప్పటి వరకు 1,75,649 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.