ఢాకా: ప్రతిష్ఠాత్మక ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీలో భారత జట్టు బోణీ కొట్టింది. యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, ఒక సిక్సర్) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్తో విజృంభించడంతో శనివారం తొలి మ్యాచ్లో టీమ్ఇండియా 41 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జెమీమాతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ (33) రాణించింది. అనంతరం లక్ష్యఛేదనలో లంక 18.2 ఓవర్లలో 109 పరుగులకు కుప్పకూలింది. హాసిని (30) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో హేమలత 3.. పూజ, దీప్తి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.