న్యూఢిల్లీ: దేశంలో మహిళల భద్రతపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు భద్రత కరువైందని ఆయన ఆరోపించారు. మహిళలు భద్రంగా ఉన్నప్పుడే దేశంలో ప్రగతి సాధ్యమని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఉత్తరాఖండ్ రిసార్టులో 19 ఏండ్ల రిసెప్షనిస్ట్ హత్య, యూపీలోని మొరాదాబాద్లో మహిళపై సామూహిక అత్యాచారం ఘటనల నేపథ్యంలో రాహుల్గాంధీ పైవిధంగా స్పందించారు.
ఉత్తరాఖండ్లోని పౌరి జిల్లాలో, ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో చోటుచేసుకున్న ఘటనలు ప్రతి ఒక్కరిని షాక్కు గురిచేశాయని రాహుల్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం పౌరీ జిల్లాలోగల రిసార్టులో బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య 19 ఏండ్ల యువతిని హత్యచేశాడు. ఆ రిసార్టు పుల్కిత్ ఆర్యదే. ఈ హత్యకు రిసార్టు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ కూడా సహకరించారు.
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో గత వారం ఓ మహిళపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె దుస్తులు కూడా ఎత్తుకెళ్లడంతో సదరు మహిళ నగ్నంగా నడిచి వెళ్తున్న 15 సెకన్ల వీడియో ఆన్లైన్లో చక్కెర్లు కొట్టింది. ఈ రెండు ఘటనల నేపథ్యంలో రాహుల్గాంధీ పైవిధంగా స్పందించారు.