IND vs SA Live Updates | టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలనుకుంటున్న టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమైంది. రెండు రోజుల క్రితమే ఉప్పల్లో ఆస్ట్రేలియాపై సిరీస్ చేజిక్కించుకున్న రోహిత్ సేన ఇక దక్షిణాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమైంది. పొట్టి ప్రపంచకప్నకు ముందు భారత జట్టుకు ఇదే ఆఖరి సిరీస్ కాగా జట్టు కూర్పును పరీక్షించుకోవడానికి యాజమాన్యానికి ఇదే ఆఖరి అవకాశం కానుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా మెగాటోర్నీ జరుగనున్న నేపథ్యంలో భారత జట్టు లోపాలు సరిదిద్దుకోవాలని చూస్తుంటే సొంతగడ్డపై రోహిత్సేనకు షాక్ ఇవ్వాలని సఫారీలు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో తొలి వన్డేలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కొత్త పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ పేరుపై ఇంకా సస్పెన్స్ ఉన్నా.. ఆ కొత్త పార్టీకి దాదాపు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అన్న పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే దేశ రాజకీయాల్లో మార్పు కోరుతూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను కొన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన విదుతాలై చిరుతైగల్ కచ్చె(వీసీకే) పార్టీని .. కేసీఆర్ కొత్త పార్టీలో విలీనం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు నుంచి VCK వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్ కూడా హైదరాబాద్కు వచ్చారు. తమిళనాడు తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావును కూడా ఆహ్వానించారు. మరో వైపు తమ పార్టీలను కొత్త పార్టీలో విలీనం చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. తమిళనాడుకు చెందిన VCK తెలంగాణ భవన్ వేదికగా విలీనకం కానున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఇంకో పార్టీ కూడా కేసీఆర్ కొత్త పార్టీలో విలీనమయ్యేందుకు రంగం సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
బీఆర్ఎస్ ఏర్పాటు కార్యక్రమానికి రావాల్సిందిగా పలు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నేతలకు కేసీఆర్ ఆహ్వానాలు పంపించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు పలు రాష్ట్రాల నుంచి 40 మంది ప్రముఖ నేతలు హైదరాబాద్కి చేరుకున్నారు. కర్ణాటక నుంచి జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్ణతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఆ నేతలకు సీఎం కేసీఆర్ ఆల్పాహార విందు ఇచ్చారు.
పవర్ప్లేలో ఫీల్డింగ్ నిబంధనలు ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (11 నాటౌట్) టెస్టు తరహా బ్యాటింగ్ ఆడుతున్నాడు.
అదే సమయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (3) కూడా నిరాశ పరిచాడు. పవర్ప్లే ముగిసిన వెంటనే నోర్జీ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో భారత జట్టు 17 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. పవర్ప్లేలో భారత జట్టు ఇంత తక్కువ స్కోరు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తొలి టీ20లో భారత జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. 107 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా.. సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్లు ఆడలేకపోయింది. ఈ క్రమంలోనే రబాడ వేసిన మూడో ఓవర్లో రోహిత్ శర్మ (0) పెవిలియన్ చేరాడు.
గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా జట్టు 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, దీపక్ చాహర్ 2, హర్షల్ పటేల్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు
ఆరు వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా పయనిస్తున్న ఆ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించిన వేన్ పార్నెల్ (24) కూడా అవుటయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన 16వ ఓవర్లో బౌండరీ బాదిన పార్నెల్ మరో బౌండరీ బాదేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గాల్లోకి లేచిన బంతిని డీప్ మిడ్ వికెట్లో సూర్యకుమార్ పట్టేశాడు. దీంతో సఫారీ జట్టు 16 ఓవర్లకు 72/7 స్కోరుతో నిలిచింది.
వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌతాఫ్రికా జట్టును ఆదుకునేలా కనిపించిన ఎయిడెన్ మార్క్రమ్ (25) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో సఫారీ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 8వ ఓవర్లో నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదిన మార్క్రమ్.. అదే ఓవర్ చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌతాఫ్రికా జట్టును ఆదుకునేలా కనిపించిన ఎయిడెన్ మార్క్రమ్ (25) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో సఫారీ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 8వ ఓవర్లో నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదిన మార్క్రమ్.. అదే ఓవర్ చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
భారత్తో జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికాకు అనుకున్న ఆరంభం లభించలేదు. మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టును యువ పేసర్లు దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్ ముప్పుతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో పవర్ప్లే ముగిసేసరికి సఫారీ జట్టు 5 వికెట్ల నష్టానికి 30 పరుగులతో నిలిచింది.
భారత్తో జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. దీపక్ చాహర్, అర్షదీప్ ఇద్దరూ రెచ్చిపోవడంతో రెండు ఓవర్లలోనే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్
సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డీకాక్, రైలీ రూసో, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టియన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, ఆన్రిచ్ నోర్జీ, తబ్రయిజ్ షంసీ
🚨 Team News 🚨
A look at #TeamIndia's Playing XI for the first #INDvSA T20I 🔽
Follow the match ▶️ https://t.co/L93S9jMHcv pic.twitter.com/Uay6kuQJbE
— BCCI (@BCCI) September 28, 2022
సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచింది. కేరళలోని తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తాము ముందుగా బౌలింగ్ చేస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే ఈ సిరీస్లో విశ్రాంతినిచ్చిన హార్దిక్, భువనేశ్వర్ స్థానంలో పంత్, అర్షదీప్ ఆడుతున్నట్లు చెప్పాడు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, పంత్, కార్తీక్, అక్షర్, దీపక్, అర్శ్దీప్, బుమ్రా, చాహల్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, రాసో, మార్క్మ్,్ర మిల్లర్, స్టబ్స్, ఫెలుక్వాయో, జెన్సెన్, రబడ, నోర్జే, తబ్రేజ్ షంసీ.
ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున అదరగొట్టిన డేవిడ్ మిల్లర్పై దక్షిణాఫ్రికా గంపెడు ఆశలు పెట్టుకుంది. ఇక్కడి పిచ్లపై విశేష అనుభవం ఉన్న అతడు రాణిస్తే టీమ్ఇండియాకు కష్టాలు తప్పకపోవచ్చు. క్వింటన్ డికాక్, టెంబ బవుమా, రాసో, అయిడెన్ మార్క్మ్,్ర స్టబ్స్, ఫెలుక్వాయోతో కూడిన బ్యాటింగ్ లైనప్ సఫారీల సొంతం. కాగా.. బౌలింగ్లో కగిసో రబడ, అన్రిచ్ నోర్జే కీలకం కానున్నారు. ఆరున్నర అడుగుల పేస్ ఆల్రౌండర్ మార్కో జెన్సెన్ను ఎదుర్కోవాలంటే భారత ఆటగాళ్లు శక్తికి మించి కష్టపడాల్సిందే. భారత పిచ్లపై చక్కటి రికార్డు ఉన్న తబ్రేజ్ షంసీ స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నాడు.
ఆసీస్తో సిరీస్లో బ్యాటర్లంతా రాణించడంతో మేనేజ్మెంట్కు ఈ అంశంలో పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. రోహిత్శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీతో.. టాప్-3 శత్రు దుర్భేద్యంగా కనిపిస్తుండగా.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ రూపంలో 360 డిగ్రీస్ ప్లేయర్ అందుబాటులో ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన చివరి టీ20లో విరాట్, సూర్య మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినివ్వడంతో అతడి స్థానంలో పంత్ బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయనున్నారు. దీపక్ చాహర్ కూడా బ్యాట్తో ఒక చేయి వేయగలవాడే కావడంతో భారత్ లైనప్ బలంగా కనిపిస్తున్నది.
షాబాజ్ను ఎంపిక చేసినా.. తుది జట్టులో చోటు కష్టమే! కరోనా బారిన పడిన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ సిరీస్కు దూరం కాగా.. అర్శ్దీప్ సింగ్, దీపక్ చాహర్తో కలిసి జస్ప్రీత్ బుమ్రా పేస్ బాధ్యతలు చూసుకోనున్నాడు. గత కొన్ని మ్యాచ్లుగా డెత్ ఓవర్స్లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్న టీమ్ఇండియా.. ఈ సిరీస్తో ఆ లోపాన్ని అధిగమించాలని అనుకుంటున్నది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయపడటంతో జట్టులో చోటు దక్కి ంచుకున్న అక్షర్ పటేల్ ఆసీస్తో సిరీస్లో దుమ్మురేపాడు. మూడు మ్యాచ్ ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డు గెలుచుకున్నాడు. అతడి నుంచి మేనేజ్మెంట్ ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తుండగా.. చాహల్ మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.
మెగాటోర్నీకి ముందు జట్టు కూర్పుతో పాటు లోపాలను అధిగమించేందుకు ఈ సిరీస్ను వాడుకోవాలని రోహిత్ సేన భావిస్తున్నది. డెత్ ఓవర్స్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్న మన బౌలర్లు ఆ తప్పులను సరిదిద్దుకోవాలని చూస్తున్నారు. మెగాటోర్నీకి ముందు పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని.. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. ఫలితంగా తుది జట్టు ఎంపిక మేనేజ్మెంట్కు ఇబ్బందికరంగా మారింది. గాయం కారణంగా దీపక్ హుడా కూడా అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే తుది జట్టులో దినేశ్ కార్తీక్తో పాటు రిషబ్ పంత్కు చోటు దక్కనుంది. మరోవైపు ఈ ఫార్మాట్లో ఆడిన గత నాలుగు మ్యాచ్ల్లోనూ నెగ్గిన దక్షిణాఫ్రికా.. సొంతగడ్డపై భారత్ను ఓడించి ప్రపంచకప్ ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చూస్తున్నది.