న్యూఢిల్లీ : (Foreigners Visas) నవంబర్ 15 నుంచి విదేశీయులకు పర్యాటక వీసాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనున్నది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు అక్టోబర్ 15 నుంచి చార్టర్డ్ విమానాల ద్వారా భారతదేశానికి వచ్చే విదేశీయులకు తాజా టూరిస్ట్ వీసాలను మంజూరు చేయడం ప్రారంభిస్తారు. అయితే, చార్టర్డ్ ఎయిర్క్రాఫ్ట్ కాకుండా ఇతర విమానాల ద్వారా ప్రయాణించే విదేశీ పర్యాటకులకు నవంబర్ 15 నుంచి వీసాలు ఇస్తారు.ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన అన్ని కొవిడ్-19 మార్గదర్శకాలు, నిబంధనలను విదేశీ పర్యాటకులు, భారతదేశంలోకి తీసుకువచ్చే క్యారియర్లు, ల్యాండింగ్ స్టేషన్లలో ఇతర వాటాదారులు తప్పనిసరిగా పాటించాలని ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది.
కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విదేశీ పర్యాటకులకు మంజూరు చేసిన అన్ని వీసాలను కేంద్ర హోం శాఖ గత ఏడాది నిలిపివేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలపై అనేక ఇతర ఆంక్షలు కూడా విధించింది. కొవిడ్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అనంతరం.. విదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించేందుకు, ఉండేందుకు టూరిస్ట్ వీసా కాకుండా ఇతర భారతీయ వీసాలను పొందేందుకు అనుమతించారు. దీనికన్నా ముందు విదేశీ పర్యాటకులకు అనుమతించడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, పర్యాటక రంగంలోని వివిధ సంస్థల నుంచి సలహాలను తీసుకున్నారు. అలాగే, హోం మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖలను సంప్రదించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నారు.
జాన్వీ కపూర్ మణికట్టుపై టాటూ.. ఎవరీ లబ్బూ?
రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్
ఆర్ఎస్ఎస్ లేకపోతే దేశం రెండో పాకిస్తాన్ అయ్యేది: ప్రభు చౌహాన్
బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి మేనక, వరుణ్ ఔట్!
వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలి : వెంకయ్యనాయుడు
మలేరియా వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం
సంపాదనలో 10 వ వంతు దానం చేయమన్న గురు గోవింద్ సింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..