న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,40,947కు చేరాయి. ఇందులో 11,366 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,25,07,834 మంది కోలుకోగా, 5,21,747 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో నలుగురు మృతిచెందగా, 796 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.
ఇక రికవరీ రేటు 98.74 శాతం ఉందని, మరణాలు 1.21 శాతం, యాక్టివ్ కేసులు 0.03 శాతమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,86,38,31,723 కరోనా డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో శుక్రవారం 6,89,724 మందికి వ్యాక్సినేషన్ చేశామని ప్రకటించింది.