న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 9216 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. ఇందులో 3,40,45,666 మంది కరోనా నుంచి కోలుకోగా, 99,976 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,70,115 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 391 మంది కరోనాకు బలవగా, 8612 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.