న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండో రోజూ వెయ్యి లోపే నమోదయ్యాయి. 196 రోజుల తర్వాత మంగళవారం 862 కేసులు నమోదవగా, తాజాగా మరో 830 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,45,768కి చేరింది. ఇందులో 4,40,95,180 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,981 మంది వైరస్కు బలయ్యారు. మరో 21,607 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 1771 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్త కేసుల్లో 0.5 కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.77 శాతం ఉందని తెలిపింది. ఇక మరణాల రేటు 1.2 శాతంగా ఉందని, రోజువారీ పాటివిటీ 0.67 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు 219.57 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.