న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 6,987 కరోనా కేసులు, 162 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,86,802కు, మొత్తం మరణాల సంఖ్య 4,79,682కు పెరిగింది. ప్రస్తుతం 76,766 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. గత 24 గంటల్లో 7,091 మంది కోలుకున్నారని వెల్లడించింది. దీంతో మొత్తంగా 3,42,30,354 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది.