న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. నిన్నటి వరకు 50వేలకుపైగా రికార్డవగా.. శనివారం రెండు స్థాయిలో నమోదయ్యాయి. గత నాలుగు రోజుల్లో రెండు లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 కొత్తగా 62,258 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,19,08,910కు పెరిగింది. కొత్తగా 30,286 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,12,95,023 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 4,52,647 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. వైరస్ ప్రభావంతో మరో 291 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,61,240కు పెరిగింది. వ్యాక్సిన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 5,81,09,773 డోసులు వేసినట్లు వివరించింది.