న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి దిగి వస్తున్నది.. నిన్న మొన్నటి వరకు కేసులు పెరగ్గా.. శుక్రవారం మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 51,667 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా మరో 64,527 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి 1,329 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,34,445కు పెరిగింది. మొత్తం 2,91,28,267 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ బారినపడి 3,93,310 మంది మృతి చెందారు.
ప్రస్తుతం దేశంలో 6,12,868 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 96.66శాతంగా ఉందని చెప్పింది. వీక్లీ పాజిటివిటీ రేటు 3శాతానికి పడిపోయిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.98శాతానికి తగ్గిందని పేర్కొంది. టీకా డ్రైవ్లో భాగంగా 30,79,48,744 మోతాదులు పంపిణీ చేసినట్లు తెలిపింది. అలాగే ఇప్పటి వరకు మొత్తం 39.95కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.