న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,63,337కు చేరింది. ఇందులో 4,39,90,414 మంది బాధితులు కోలుకోగా, 5,28,487 మంది మృతిచెందారు. మరో 44,436 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 19 మంది కరోనాకు బలవగా, 5719 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్గా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 217.41 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని చెప్పింది.