న్యూఢిల్లీ, జూన్ 8: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 5,233 కొత్త కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం పేర్కొ న్నది. అంతకుముందు రోజు 3,714 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 41% కేసులు పెరిగాయి. కేసుల పెరుగుదల మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నది.