న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 2401 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,28,828కి చేరాయి. ఇందులో 4,40,73,308 మంది బాధితులు కోలుకోగా, 5,28,895 మంది మృతిచెందారు. మరో 26,625 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఐదుగురు కరోనాకు బలవగా 2373 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక మొత్తం కేసుల్లో 0.06 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 219.23 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.