న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 2075 కరోనా కేసులు నమోదవగా, 71 మంది మరణించారు. య్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,04,005కు చేరగా, 5,16,352 మంది మరణించారు. మొత్తం కేసుల్లో 4,24,61,926 మంది బాధితులు కోలుకోగా, 27,802 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 3,383 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06 శాతం మాత్రమేనని, రికవరీ రేటు 98.72 శాతానికి పెరిందని, మరణాల రేటు 1.20 శాతంగా ఉందని పేర్కొన్నది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.35గా ఉన్నదనివెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,81,04,96,924 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.