న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 1233 కరోనా కేసులు నమోదవగా, 31 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,30,23,215కు చేరగా, 5,21,101 మంది బాధితులు మృతిచెందారు. ఇప్పటివరకు 4,24,87,410 మంది కోలుకున్నారు. మరో 14,704 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 1876 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.03 శాతం మాత్రమే ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.20 శాతమని చెప్పింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,83,82,41,743 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో మంగళవారం ఒక్కరోజే 26,34,080 మందికి వ్యాక్సినేషన్ చేశామని తెలిపింది.