న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 1033 కేసులు నమోదవగా, తాజాగా అవి 1109కి పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,30,33,067కు చేరాయి. ఇందులో 4,25,00,002 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 11,492 మంది చికిత్స పొందుతుండగా, 5,21,573 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1213 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడగా, 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇక ఇప్పటివరకు 1,85,38,88,663 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, నిన్న ఒకేరోజు 16,80,118 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.