తిరువనంతపురం: కంగారూలపై సిరీస్ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమైంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో అంతకుముందు ప్రాక్టీస్ కోసం వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలని భారత్ భావిస్తున్నది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో రోహిత్ సేన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది.
బుధవారం తిరువనంతపురం వేదికగా జరుగనున్న తొలి టీ20 కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇక్కడికి చేరుకున్నాయి. సోమవారం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన భారత ఆటగాళ్లకు కేరళ క్రికెట్ సంఘం ఘనంగా స్వాగతం పలికింది. ఆదివారమే ఇక్కడికి వచ్చిన సఫారీ జట్టు ప్రాక్టీస్లో నిమగ్నమైంది.