ఓ గ్లోబల్ అకౌంటింగ్ సంస్థ నివేదిక ప్రకారం.. సీనియర్ మేనేజ్మెంట్ స్థానాల్లో పనిచేసే మహిళల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం మూడో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నత హోదాల్లో పనిచేసే మహిళలు సగటున 31 శాతం ఉంటే, మన దేశంలో 39 శాతం వరకూ ఉన్నారు. గత ఏడాది, ప్రపంచ వ్యాప్తంగా సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో మహిళలు పనిచేస్తున్న సంస్థలు 90 శాతం ఉండేవి. ఇప్పుడు, 98 శాతానికి పెరిగాయి. మధ్యశ్రేణి సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు
(సీయీవో)గా ప్రపంచ
వ్యాప్తంగా 26 శాతం మహిళలుంటే, ఒక్క భారత్లో మాత్రమే 47 శాతం వనితలు సీయీవో హోదాలో ఉన్నారు. కొవిడ్ సవాళ్లను సమర్థంగా
ఎదుర్కోవడంలోనూ భారత మేనేజ్మెంట్ నారీమణులు ముందున్నారని ఆ నివేదిక ప్రశంసించింది. మనం సంబురపడాల్సిన విషయమే!