ఢిల్లీ ,జూన్ 23: ఇప్పటివరకు ఇండియా తరపున ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొన్నప్లేయర్స్ ను ప్రధాన మంత్రి మోడీ ప్రశంసించారు. ఒలింపిక్ క్రీడల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.”టోక్యో ఒలింపిక్ క్రీడలలో పాలుపంచుకోనున్న భారతీయ క్రీడాకారుల కు, భారతీయ క్రీడాకారిణుల కు అంతా మంచే జరగాలి అని” మోడీ అభిలషించారు. “గత కొన్నేళ్లుగా జరిగిన వివిధ ఒలింపిక్ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వారందరిని చూసుకొని దేశ ప్రజలు గర్వపడుతున్నారు “అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
‘‘ఈ రోజు ఒలింపిక్ క్రీడలదినోత్సవం. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వారందరిని నేను అభినందిస్తున్నాను” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కొన్నివారాల్లో @Tokyo2020 మొదలవనుంది. మన దేశాని కి చెందిన క్రీడాకారులు ఆ క్రీడోత్సవాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ క్రీడలు ప్రారంభం కావడానికి ముందుగా మైగవ్ లో క్విజ్ ను నిర్వహించడం జరుగుతుంది. ఆ క్విజ్ పాల్గొనవల్సిందిగా మీ అందరికి, ప్రత్యేకించి నా యువ మిత్రులకు, నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని మోడీ పేర్కొన్నారు.