అహ్మదాబాద్: ఇంగ్లాండ్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(0)..శామ్ కరన్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి వికెట్ కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ చేజార్చుకున్నది. ప్రస్తుతం ఇషాన్ కిషన్(5), విరాట్ కోహ్లీ(1) క్రీజులో ఉన్నారు. 2 ఓవర్లకు భారత్ వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. అంతకుముందు జేసన్ రాయ్(46: 35 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది.