అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో రెండో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా విదించారు. నిర్ణీత సమయంలో భారత జట్టు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ టీమిండియా మ్యాచ్ ఫీజులో 20 శాతం ఫైన్ వేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ తప్పిదాన్ని ఒప్పుకోవడంతో పాటు జరిమానాకు కూడా అంగీకారం తెలిపాడు. రెండో టీ20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభం తర్వాత భారత్కు జరిమానా విధించడం ఇది మూడోసారి. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో భారత్కు రెండుసార్లు ఫైన్ పడింది.