చైనాను నిలువరించడంలో భారతదేశం పాత్ర చాలా కీలకమని అమెరియా నేవీ అత్యున్నత అధికారి మైక్ గిల్డే అన్నారు. వాషింగ్టన్లో జరిగిన ఒక సెమినార్లో పాల్గొన్న గిల్డే.. భారత్ వల్ల చైనా కేవలం తూర్పు వైపునే పూర్తిగా ఫోకస్ చెయ్యలేదని, భారత్ వైపు కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందన్నారు. చైనా కేవలం దక్షిణ చైనా సముద్రం, తైవాన్ సంధిపై మరీ ఎక్కువ ఫోకస్ చెయ్యకుండా ఉండేందుకు భారత్ పాత్ర చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో భారత్ తమకు కీలకమైన భాగస్వామి అవుతుందని, అందుకే ఆ దేశంలో ఎక్కువ కాలం గడిపానని వివరించారు. తమకు హిందూ మహాసముద్రం చాలా కీలకంగా మారుతోందని చెప్పారు. సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు ఉండటం వ్యూహాత్మకంగా ప్రధానమన్నారు. హిమాలయాల్లో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చైనాపై రెండు వైపుల నుంచి దాడులు జరిగే అవకాశాన్ని సృష్టిస్తున్నాయనే విషయం అమెరికా వ్యూహక్తలకు గట్టి పట్టునిస్తోందని తెలిపారు.
దక్షిణాసియాలో భారత్ సాధ్యమైనంత శక్తిమంతంగా ఎదగాలని, తద్వారా చైనా అటెన్షన్ ఆ దేశానికి దక్కితే.. రెండు వైపులా దాడులు జరిగితే ఏంటనే సమస్య చైనాను బలహీనపరుస్తుందని, అమెరికా-జపాన్ అదే కోరుకుంటున్నాయని తమ వ్యూహాలను వివరించారు గిల్డే. కాగా, అమెరికా-భారత్ బలగాలు వచ్చే అక్టోబరులో ఉత్తరాఖండ్ వేదికగా సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి.
ఈ ‘యుద్ధ అభ్యాస్’ విన్యాసాలు సాధారణంగా చైనా బోర్డర్కు 300 కిలోమీటర్ల దూరంలో జరిగేవి. అయితే ఈసారి బోర్డర్కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే సముద్రమట్టానికి 3వేల కిలోమీటర్ల ఎత్తులో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా బోర్డర్లో చైనాకు గట్టి వార్నింగ్ ఇవ్వాలనేది భారత్ ఆలోచన.