భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు.. శుక్రవారం సెమీఫైనల్లో ఆరు సార్లు టైటిల్ విజేత జర్మనీతో అమీతుమీకి సిద్ధమైంది. టోర్నీ తొలి మ్యాచ్లో ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైన భారత్.. ఆ తర్వాత వరుస విజయాలతో నాకౌట్కు అర్హత సాధించడంతో పాటు బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బెల్జియంను చిత్తు చేసి సెమీస్కు దూసుకొచ్చింది. చక్కటి డిఫెన్స్కు తోడు డ్రాగ్ ఫ్లిక్ నైపుణ్యంతో ముందుకు సాగుతున్న టీమ్ఇండియా.. అదే జోరులో జర్మనీని మట్టికరిపించి తుదిపోరుకు అర్హత సాధించాలని చూస్తుంటే.. సొంతగడ్డపై భారత్కు షాక్ ఇవ్వాలని జర్మనీ తహతహలాడుతున్నది. టోర్నీలో రెండు హ్యాట్రిక్లు నమోదు చేసిన సంజయ్తో పాటు అరైజీత్, అభిషేక్, కెప్టెన్ వివేక్ సాగర్ ప్రసాద్ మరోసారి కీలకం కానున్నారు.