ఢిల్లీ ,జూన్ 3: చీఫ్ ఎనర్జీ మినిస్టీరియల్ 12వ సమావేశంలో యుఎన్ఐడిఒ సమన్వయంతో ఎనర్జీ (కాలుష్యం వెలువరించని, పునరావృత ఇంధనాలు) మంత్రిత్వ శాఖల (సిఇఎం) కింద యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వంతో కలిసి పారిశ్రామిక ఇంధన సామర్ధ్యాన్ని ప్రోత్సహించడానికి పరిశ్రమలలో తీవ్రమైన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే చొరవ అయిన ఇండస్ట్రియల్ డీప్ డీకార్బొనైజేషన్ ఇనిషియేటివ్ (ఐడిడిఐ) కొత్త పనివిధానాన్ని ప్రారంభించింది. 12వ సిఇఎం మే31న ప్రారంభమైంది, 6 జూన్ 2021వరకు కొనసాగనుంది.ఐడిడిఐ చొరవకు జర్మనీ, కెనెడా మద్దతు పలుకగా, త్వరలోనే మరిన్ని దేశాలు ఇందులో చేరుతాయని అంచనా. దీని ద్వారా లక్ష్యంగా పెట్టుకున్న హరిత సాంకేతికతలను ప్రోత్సహించి, తక్కువ కార్బన్ కలిగిన పారిశ్రామిక పదార్ధాలకు డిమాండ్ను పెంచనున్నారు.
2030 నాటికి భారత దేశం ప్రతి జిడిపి యూనిట్కు 33 నుంచి 35 శాతం మేరకు ఉద్గారాలను తగ్గించేందుకు కట్టుబడి ఉందని విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ అన్నారు. ఇనుము, ఉక్కు, సిమెంటు, పెట్రోకెమికల్స్ వంటి అత్యధిక ఇంధనం అవసరమయ్యే రంగాల్లో స్వల్ప కార్బన్ సాంకేతికతలను ప్రభావవంతంగా మోహరించడంపై ఈ హామీ ఆధారపడి ఉంది. డిమాండ్ ఉన్నరంగాలలో ప్రభుత్వ విధానాల ఫలితంగా ఇంధన ఆదా అవుతుందని ఆయన వివరించారు.