అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగవ టెస్టులో ఇండియా విక్టరీకి చేరువలో ఉన్నది. మరో నాలుగు వికెట్లు తీస్తే భారత్ అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకోనున్నది. మొతెరా టెస్టు రెండవ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఎదురీదుతున్నది. మూడవ రోజు టీ విరామ సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 91 రన్స్ చేసింది. భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. డాన్ లారెన్స్ 19 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు. ఇవాళ ఉదయం భారత్ 365 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.