ములుగు, (నమస్తే తెలంగాణ)/కృష్ణకాలనీ, ఆగస్టు 14: దేశానికి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం పంద్రాగస్టు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు కలెక్టరేట్ ఆవరణలో జరిగే వేడుకల్లో ముఖ్యఅతిథిగా శాసన మండలి సభ్యుడు, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు హాజరై ఉదయం 10.30గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. ప్రభుత్వం జిల్లాలో చేపట్టిన పనుల వివరాలు, ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలపై ప్రసంగించనున్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించి ఉత్తమ అధికారులుగా ఎంపికైన 279 మందికి ప్రశంసా పత్రాలను అందించనున్నారు. వజ్రోత్సవాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను మూడు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కృష్ణకాలనీలోని అంబేద్కర్ క్రీడా మైదానం స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు ముస్తాబైంది. టెంటు, కుర్చీలు, స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అనురాగ్ శర్మ హాజరై 10.30గంటలకు జాతీయ జెండాను పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనులపై ప్రసంగించనున్నారు. శకటాల ప్రదర్శన, ఉత్తమ అధికారులకు ప్రశంసాపత్రాలు అందిస్తారు.