భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో జింబాబ్వే బ్యాటర్లు పోరాడుతున్నారు. శుభ్మన్ గిల్ (130), ఇషాన్ కిషన్ (50) రాణించడంతో భారత జట్టు 290 పరుగుల టార్గెట్ నిలిపింది. లక్ష్య ఛేదనలో దీపక్ చాహర్ ఆరంభంలోనే జింబాబ్వేను దెబ్బకొట్టాడు. ఓపెనర్ ఇన్నొసెంట్ కాయా (6)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపటికే కైటానో (12) రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు.
ఇలాంటి సమయంలో షాన్ విలియమ్స్ (27 నాటౌట్) ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. టోనీ మున్యోంగా (2 నాటౌట్)ను ఒక ఎండ్లో నిలబెట్టి తను మాత్రం అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే జట్టు ఒక వికెట్ నష్టానికి 49 పరుగులతో నిలిచింది.