IND vs WI | రెగ్యులర్ కెప్టెన్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆడిన తొలి సిరీస్లోనే విజయం సాధించిన రోహిత్ శర్మ.. ఇదే జోరులో వెస్టిండీస్ను మరోసారి దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కాసేపట్లో తొలి పోరు జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.