విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. సీనియర్ల గైర్హాజరీలో రోహిత్తో ఓపెనింగ్ బాద్యతలు పంచుకున్న ఇషాన్ కిషన్ (28) పెవిలియన్ చేరాడు. విండీస్ స్టార్ స్పిన్నర్ అకీల్ హొస్సేన్ బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కిషన్.. ఫాబియన్ అలెన్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 115 పరుగుల వద్ద భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది.
అంతకుముందు స్వల్పలక్ష్యఛేదనలో 60 పరుగులతో అదరగొట్టిన టీమిండియా నయా కెప్టెన్ రోహిత్ శర్మ ఎల్బీగా వెనుతిరిగాడు. అదే ఓవర్ ఐదో బంతికి విరాట్ కోహ్లీ (8) కూడా పెవిలియన్ చేరాడు. వచ్చీ రావడంతోనే రెండు ఫోర్లు బాదిన కోహ్లీ ఆ తర్వాత అనవసర షాట్కు యత్నించి వికెట్ పారేసుకున్నాడు.
ఆ తర్వాత కాసేపటికే రిషభ్ పంత్ రనౌట్ అయ్యాడు. జోసెఫ్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. దానికి జోసెఫ్ కాలు అడ్డుపెట్టాడు. అతని కాలికి తగిలిన బంతి నాన్స్ట్రయికర్ ఎండ్లో వికెట్లను తాకింది. అప్పటికే క్రీజును వదిలి పంత్ ముందుకు వచ్చేయడంతో అతను రనౌట్ అయ్యాడు. దీంతో భారత జట్టు 116/4 స్కోరుతో నిలిచింది.