శ్రీలంకతో టీ20లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. రెండు టెస్టుల సమరానికి సిద్ధమవుతోంది. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టెస్టు భారత జట్టుకు ప్రత్యేకం. ఎందుకంటే ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. అలాగే కొత్త కెప్టెన్ రోహిత్కు ఫుల్టైం టెస్టు సారధిగా తొలి టెస్టు. ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ వంటి సీనియర్లకు ఈ జట్టులో చోటు దక్కలేదు.
యువ ఆటగాళ్లను సానబెట్టాలనే ఉద్దేశ్యంలో జట్టు ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు కోచ్ ద్రావిడ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు ఆటగాడు హనుమ విహారి, పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్కు టెస్టు టీంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరే కాకుండా సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ కూడా మంచి ఆప్షన్లుగా ఉన్నారు. వెటరన్ స్పిన్నర్ అశ్విన్ కూడా గాయం నుంచి కోలుకొని ఫిట్గా ఉన్నట్లు జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా చెప్పాడు.
అయితే ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. శ్రీలంకతో జరిగిన చివరి రెండు టీ20లకు 50శాతం ప్రేక్షకులను అనుమతించారు. దీంతో టెస్టులకు కూడా అలాగే ప్రేక్షకులు ఉంటారని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఈ మ్యాచులకు ఎవరినీ అనుమతించబోమని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం భారత జట్టు మొహాలీలో ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటోంది. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్, మహమ్మద్ సిరాజ్, మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్, రిషభ్ పంత్ తదితరులంతా ఈ ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నారు.
— BCCI (@BCCI) March 1, 2022
— BCCI (@BCCI) March 1, 2022