రెండో టీ20లో భారత బ్యాటర్లు చెలరేగారు. సపారీ బౌలర్ల తడబాటును పూర్తిగా ఉపయోగించుకున్న టీమిండియా ఆటగాళ్లు ఎడాపెడా బౌండరీలతో అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు రోహిత్ శర్మ (43), కేఎల్ రాహుల్ (57) అదిరిపోయే ఆరంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (61) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
విరాట్ కోహ్లీ (49 నాటౌట్) కూడా అద్భుతంగా ఆడాడు. సూర్య అవుటైన తర్వాత వచ్చిన ఫినిషర్ డీకే (7 బంతుల్లో 17 నాటౌట్) అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోరు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
– Fourth-highest men's T20I score by India
– Highest men's T20I total against SAINDIA TOUCH THE SKY 🚀
#INDvSA— ESPNcricinfo (@ESPNcricinfo) October 2, 2022