గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ (29 నాటౌట్), కేఎల్ రాహుల్ (25 నాటౌట్) అద్భుతమైన ఆరంభం అందించారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు.
రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ ఆరంభంలో బంతిని టైమింగ్ చేయడానికి ఇబ్బంది పడినప్పటికీ ఆ తర్వాత కుదురుకున్నాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి భారత జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 57 పరుగులు చేసింది.