సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టును భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో భారత్కు కూడా ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ రోహిత్ (0) డకౌట్ అవగా.. పవర్ప్లేలో భారత్ కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో ఒత్తిడికి గురైన కోహ్లీ (3).. స్కోరుబోర్డు వేగం పెంచేందుకు రిస్క్ తీసుకొనేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అయితే ఆరంభంలో టెస్టు తరహా బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ (51 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. అతను అండగా సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్) రెచ్చిపోయాడు. వీళ్లిద్దరూ మంచి ఇన్నింగ్స్ ఆడటంతో భారత జట్టు 16.4 ఓవర్లలో 110 పరుగులు చేసి, 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. సఫారీ బౌలర్లలో రబాడ, నోర్జీ చెరో వికెట్ తీసుకున్నారు.
1-0 🇮🇳🇿🇦
Team India takes a lead in the three-match T20I series against South Africa with a comfortable win 🙌🏻#Indiancricketteam #teamindia #INdvSA #cricketindia pic.twitter.com/5wR5PdWfDo
— Sportskeeda (@Sportskeeda) September 28, 2022