సీనియర్ల గైర్హాజరీలో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో ఓటమి చవిచూశాడు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో సౌతాఫ్రికాతో రెండో మ్యాచ్కు సిద్ధమయ్యాడు. కటక్లోని బారాబటి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో సఫారీ సారధి టెంబా బవుమా టాస్ గెలిచాడు.
తాము ఛేజ్ చేయాలనుకుంటున్నామని, అందుకే ముందుగా బౌలింగ్ చేస్తామని బవుమా చెప్పాడు. తమ జట్టులో రెండు మార్పులు జరిగినట్లు వెల్లడించాడు. చేతికి గాయం కావడంతో క్వింటన్ డీకాక్ ఆడటం లేదని, ట్రిస్టియన్ స్టబ్స్ కూడా ఈ మ్యాచ్కు దూరమయ్యాడని తెలిపాడు.
వీళ్ల స్థానంలో రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్ ఆడుతున్నట్లు చెప్పాడు. అదే సమయంలో తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని పంత్ స్పష్టం చేశాడు. తాము గత మ్యాచ్లో ఎలాంటి తప్పూ చేయలేదని, ఎగ్జిక్యూషన్ మాత్రం మెరుగైతే చాలని చెప్పాడీ యువ కెప్టెన్.
భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, ఆవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్
సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, టెంబా బవుమా (కెప్టెన్), రాసీ వాన్ డర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిక్ క్లాసెన్, డ్వెయిన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, ఆన్రిచ్ నోర్ట్జీ, తబ్రయిజ్ షంసీ
A look at the Playing XI for the 2nd T20I.
Live – https://t.co/fLWTMjhyKo #INDvSA @Paytm https://t.co/CHnUIyzxlS pic.twitter.com/WGoEuX8X2m
— BCCI (@BCCI) June 12, 2022