భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో సఫారీ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ప్రమాదకర ఓపెనర్ క్వింటన్ డీకాక్ (14) మైదానం వీడాడు. హర్షల్ పటేల్ వేసిన ఐదో ఓవర్ ఐదో బంతికి అతను పెవిలియన్ చేరాడు. హర్షల్ వేసిన బంతిని ముందుకొచ్చి బాదేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో డిఫెన్స్ చేసుకున్నాడు.
అదే సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న ప్రిటోరియస్ రెండు అడుగులు ముందుకు వేశాడు. అంతే డీకాక్ అనవసర పరుగు కోసం ముందుకు వచ్చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హర్షల్ వేగంగా వెళ్లి కింద పడిన బంతి అందుకొని వికెట్లు కూల్చాడు.
ఆ మరుసటి ఓవర్లోనే ప్రిటోరియస్ (0) కూడా పెవిలియన్ చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన బంతిని భారీ సిక్సర్ బాదేందుకు ప్రయత్నించిన అతను మిస్ అయ్యాడు. దాంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి డైరెక్ట్గా పంత్ వైపు వెళ్లింది. దాన్ని అతను సులభంగా అందుకోవడం ప్రిటోరియస్ మైదానం వీడాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి సఫారీ జట్టు రెండు వికెట్ల నష్టానికి 35 పరుగులతో నిలిచింది.