భారత్తో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా జట్టు పోరాడుతోంది. ఆరంభంలోనే టెంబా బవుమా (0), రైలీ రూసో (0) వికెట్లు కోల్పోయిన ఆ జట్టును స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ (33) ఆదుకున్నాడు. మరో ఓపెనర్ క్వింటన్ డీ కాక్ (9 నాటౌట్) అతనికి మంచి సహకారం అందించాడు.
దీంతో సఫారీ జట్టు పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులతో నిలిచింది. అయితే పవర్ప్లే ముగిసిన మరుసటి ఓవర్లోనే మార్క్రమ్ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. అక్షర్ వేసిన బంతిని కవర్ డ్రైవ్ ఆడేందుకు మార్క్రమ్ ప్రయత్నించాడు. కానీ బంతిని మిస్సయ్యాడు. దాంతో అది వికెట్లను కూల్చింది. దీంతో సఫారీ జట్టు 47 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.