భారత్తో జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ టెంబా బవుమా (8) పెవిలియన్ చేరాడు. పవర్ప్లేలో బౌలింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ సత్తా చాటాడు. అతను వేసిన బంతిని మిడాన్ మీదుగా బాదేందుకు బవుమా ప్రయత్నించాడు.
అయితే టైమింగ్ మిస్ అవడంతో ఫీల్డర్ను దాటించలేకపోయాడు. ఈ క్రమంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఆవేష్ ఖాన్ కుడివైపు పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో బవుమా పెవిలియన్ చేరాడు. దీంతో నాలుగు ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా జట్టు ఒక వికెట్ నష్టానికి 23 పరుగులతో నిలిచింది.