సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచింది. కేరళలోని తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తాము ముందుగా బౌలింగ్ చేస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే ఈ సిరీస్లో విశ్రాంతినిచ్చిన హార్దిక్, భువనేశ్వర్ స్థానంలో పంత్, అర్షదీప్ ఆడుతున్నట్లు చెప్పాడు. అలాగే ప్రాక్టీస్ సమయంలో బుమ్రాకు వెన్నునొప్పి వచ్చిందని, దీంతో అతనికి విశ్రాంతినిచ్చి దీపక్ చాహర్ను ఆడిస్తున్నామని వెల్లడించాడు.
చాహల్ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదని, అతని స్థానంలో అశ్విన్ ఆడుతున్నట్లు తెలిపాడు. టీ20 ప్రపంచకప్ ముందు భారత్ ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే కావడంతో.. ఇప్పటి వరకు అనుకున్న ప్లాన్లకు మెరుగులు దిద్దుకునే చివరి అవకాశం ఇదే కానుంది. తాను కూడా టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ ఎంచుకునేవాడినని సఫారీ సారధి టెంబా బవుమా చెప్పాడు. అలాగే భారత్లో ఇప్పటి వరకు సఫారీలతో ఆడిన ఒక్క టీ20 సిరీస్ కూడా భారత్ గెలవకపోవడం గమనార్హం.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్
సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డీకాక్, రైలీ రూసో, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టియన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, ఆన్రిచ్ నోర్జీ, తబ్రయిజ్ షంసీ
🚨 Team News 🚨
A look at #TeamIndia's Playing XI for the first #INDvSA T20I 🔽
Follow the match ▶️ https://t.co/L93S9jMHcv pic.twitter.com/Uay6kuQJbE
— BCCI (@BCCI) September 28, 2022
🚨 Toss Update🚨@ImRo45 has won the toss & #TeamIndia have elected to bowl against South Africa in the 1⃣st @mastercardindia #INDvSA T20I.
Follow the match ▶️ https://t.co/L93S9jMHcv pic.twitter.com/z67H1zqdMy
— BCCI (@BCCI) September 28, 2022